నిజంనిప్పులాంటిది

Mar 11 2024, 16:14

నేడు యాదాద్రి, లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి దంపతులు

ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి నేడు యాద‌గిరిగుట్ట‌, భ‌ద్రా ద్రిలో ప‌ర్య‌టించారు. ముం దుగా ఆయ‌న యాదాద్రిలో నేటి నుంచి ప్రారంభ‌మైన బ్ర‌హ్మోత్స‌వాల‌లో పాల్గొన్నారు..

ఉదయం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దంపతులు యాదగిరిగుట్ట లక్ష్మినర సింహ స్వామిని దర్శించు కున్నారు. యాదాద్రికి చేరుకున్న సీఎంకు ఆలయ అర్చకులు పూర్ణ కుంభ స్వాగతం పలికారు.

స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో సీఎం రేవంత్ రెడ్డి దంపతులు, మంత్రుల బృందం పాల్గొ న్నారు.ప‌ట్టువ‌స్త్రాలు స‌మ‌ర్శించిన రేవంత్…

వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా తొలి రోజు ప్రభుత్వం తరుపున స్వామి వారికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను ముఖ్యమంత్రి రేవంత్ సమర్పించారు.

సీఎం వెంట డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు కొండా సురేఖ, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నారు. అలాగే ఎమ్మెల్యేలు బీర్ల అయిలయ్య, కుంభం అనిల్ కుమార్ రెడ్డి, వేముల వీరేశం, బీఎల్‌ఆర్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

భ‌ద్రాద్రి రామ‌య్య సేవ‌లో..

యాదాద్రి నుంచి నేరుగా హెలికాప్ట‌ర్ లో సిఎం భద్రా చలం చేరుకున్నారు. అనం త‌రం శ్రీ సీతారామచంద్ర స్వామిని రేవంత్ దంప‌తు లు దర్శించుకున్నారు.

రామాలయానికి చేరుకున్న సీఎం రేవంత్ దంపతులకు దేవస్థానం అర్చకులు, సిబ్బంది ఆలయ మర్యాద లతో స్వాగతం పలికారు. అనంతరం సీతారామచంద్ర స్వామి వారిని ముఖ్య మంత్రి దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.

ఉపాలయం లక్ష్మీ తాయారు అమ్మ వారి ఆలయంలో రేవంత్ దంపతులకు వేద ఆశీర్వాదం అందించారు. ముఖ్యమంత్రి వెంట డిప్యూ టీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల పొంగులేటి, కొండా సురేఖ, సీతక్క ఉన్నారు...

నిజంనిప్పులాంటిది

Mar 06 2024, 07:52

ఇందిరమ్మ ఇళ్లకు 3 వేల కోట్లు మంజూరు చేసిన రేవంత్ సర్కార్

రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టబోతున్న ఇందిరమ్మ ఇళ్ల పథకానికి హడ్కో రూ.3 వేల కోట్ల రుణాన్ని మంజూరు చేసేందుకు సమ్మతించింది.

ఈ మేరకు రుణం పొందేం దుకు స్టేట్ హౌజింగ్ బోర్డుకు ప్రభుత్వం అనుమతిని తెలిపింది. ఇందులో భాగంగా 95,235 ఇందిరమ్మ ఇళ్లకు గాను హడ్కో రూ.3 వేల కోట్ల రుణాన్ని సాంక్షన్ చేయనుంది.

గ్రామాల్లో 57,141 ఇళ్లు పట్టణాల్లో 38,094 ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణా లకు ఆ రుణాలను స్టేట్ హౌజింగ్ బోర్డు వినియోగ నించనుంది.

Streetbuzz News

నిజంనిప్పులాంటిది

Mar 03 2024, 09:18

High Temperature: రాష్ట్రంలో భానుడి ప్రతాపం.. రానున్న 5 రోజులు పెరగనున్న ఉష్ణోగ్రతలు..

తెలంగాణ రాష్టంలో వేసవి ప్రారంభం కాకముందే.. ఎండలు మండిపోతున్నాయి. మార్చి మొదటి వారంలో వేడి విపరీతంగా పెరిగింది.

రాష్ట్రంలోని సగం జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రత 37 డిగ్రీల సెల్సియస్‌ను దాటుతున్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

Streetbuzz News

నిజంనిప్పులాంటిది

Mar 03 2024, 09:13

తెలంగాణలో 45 మంది డిఎస్పీ ల బదిలీలు

రాష్ట్రంలో పనిచేస్తున్న 45 మంది డిఎస్పీ లను బదిలీ చేస్తూ డిజిపి రవిగుప్త శనివారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు.

పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఒకే పార్లమెంటు పరిధిలో గత నాలుగేళ్లలో మూడు సంవత్సరాల పాటు పని చేసిన వారిని బదిలీ చేయాలని ఎన్నికల సంఘం ఉత్తర్వుల మేరకు పెద్ద ఎత్తున బదిలీలను చేపట్టారు.

ఇటీవల ఐపీఎస్ అధి కారుల బదిలీలు చేపట్టిన ప్రభుత్వం ఈరోజు డీఎస్పీ లను బదిలీ చేశారు.

నిజంనిప్పులాంటిది

Mar 03 2024, 09:12

కాసేపట్లో కేంద్ర కేబినెట్‌ చివరి భేటీ.. మంత్రులకు ప్రధాని వీడ్కోలు పార్టీ

ఢిల్లీ: ప్రధాని మోదీ నేతృత్వంలో కేంద్ర కేబినెట్‌ ఆదివారం(మార్చ్‌ 3) భేటీ అవనుంది. పార్లమెంట్‌ ఎన్నికలకు త్వరలో షెడ్యూల్‌ విడుదలవనుండడంతో ఈ ప్రభుత్వంలో ఇదే చివరి కేబినెట్‌ సమావేశం కానుంది..

ఈ భేటీలో కేంద్ర మంత్రులకు ప్రధాని మోదీ వీడ్కోలు పలకనున్నారు. వారికి ప్రధాని వీడ్కోలు పార్టీ ఇవ్వనున్నారు..

మూడవసారి పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు అమలు చేయాల్సిన వ్యూహాలు, ప్రణాళికలపై ఈ సమావేశంలో ప్రధాని మంత్రులతో చర్చించే అవకాశాలున్నాయి. ఢిల్లీలోని చాణక్యపురి డిప్లమాటిక్ ఎనక్లేవ్‌లోని సుష్మా స్వరాజ్ భవన్‌లో తుది కేబినెట్‌ భేటీ జరగనుంది. ఈ నెలలోనే లోక్‌సభ సాధారణ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల కమిషన్‌(సీఈసీ) షెడ్యూల్ విడుదల చేయనుంది..

నిజంనిప్పులాంటిది

Mar 01 2024, 07:56

తెలంగాణ గురుకుల జేఎల్ డిఎల్, పరీక్ష ఫలితాలు విడుదల

తెలంగాణ సంక్షేమ గురుకుల జూనియర్‌ కాలేజీల్లో జూనియర్‌ లెక్చరర్‌ పోస్టుల భర్తీకి నిర్వహించిన రాత పరీక్ష ఫలితాలు గురువారం సాయంత్రం విడుదల య్యాయి.

ఈ మేరకు ఫలితాలను గురుకుల నియామక బోర్డు అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. మొత్తం 1,924 పోస్టుల భర్తీకి గానూ ఈ నియామక ప్రక్రియ చేపట్టింది.

జేఎల్‌ పోస్టులకు ఎంపికైన వారి ప్రాథమిక ఎంపిక జాబితాలను సబ్జెక్టుల వారీగా వెబ్‌సైట్‌లో పొందు పరిచారు. జేఎల్‌ రాత పరీక్షలకు హాజరైన అభ్యర్ధులు ఈ కింది లింక్‌ల ద్వారా నేరుగా ఫలితాను చెక్‌ చేసుకోవచ్చు.

కాగా గతేడాది ఆగస్టు 3 నుంచి 23వ తేదీ వరకు జూనియర్‌ లెక్చరర్‌ పోస్టులకు రాత పరీక్ష జరిగిన విషయం తెలిసిందే. దివ్యాంగుల కేటగిరీకి సంబంధించిన ఫలితాలు త్వరలోనే ప్రకటించ నున్నట్లు బోర్డు ఈ సందర్భంగా వెల్లడించింది..

నిజంనిప్పులాంటిది

Mar 01 2024, 07:55

నేడు బిజెపి అభ్యర్థుల తొలి జాబితా

సార్వత్రిక ఎన్నికల సమరంలో బరిలోకి దిగే అభ్యర్థులను భారతీయ జనతా పార్టీ బీజేపీ ఖరారు చేసింది.

గురువారం రాత్రి ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాల యంలో జరిగిన ఆ పార్టీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సుమారు 9 రాష్ట్రాల్లో అభ్యర్థుల కోసం కసరత్తు చేసి జాబితాను రూపొం దించింది.

ఈ జాబితా నేడు విడుదల చేసే అవకాశం ఉంది. గురువారం రాత్రి జరిగిన సమావేశంలో ఉత్తర్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, కేరళ, తెలంగాణ, రాజస్థాన్, గోవా, గుజరాత్‌తోపాటు మరికొన్ని రాష్ట్రాల్లో అభ్యర్థులపై బీజేపీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ చర్చించింది.

ఈ మేరకు ఆయా రాష్ట్రాల బీజేపీ కోర్ కమిటీలను కమలనాథులు ఢిల్లీకి పిలిపించారు. తెలంగాణ నుంచి ఢిల్లీ చేరుకున్న నేతల్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డితో పాటు..

జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్, సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సభ్యులు డా. కే. లక్ష్మణ్, జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, ఈటల రాజేందర్, జితేందర్ రెడ్డి, పొంగులేటి సుధాకర్ రెడ్డి తదితరులు న్నారు.

నిజంనిప్పులాంటిది

Feb 29 2024, 16:55

మల్కాజ్ గిరి ఎంపీ స్థానానికి ఇద్దరం పోటీ చేద్దామా? మాజీ మంత్రి కేటీఆర్

లోక్ సభ ఎన్నికలు సమీపి స్తున్న వేళ మల్కాజిగిరి ఎంపీ సీటుపై రాజకీయం గరం గరం అయింది.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కెటిఆర్ సవాల్ విసిరారు. నేను సిరిసిల్ల ఎమ్మెల్యేగా రాజీనామా చేస్తా.. రేవంత్ రెడ్డి సీఎం పదవికి, కొడంగల్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చెయ్ అన్నారు.

ఇద్దరం మల్కాజ్‌గిరి ఎంపీ స్థానంలో పోటీ చేద్దాం.. సేఫ్ గేమ్ వద్దు స్ట్రెయిట్ ఫైట్ చేద్దామని కెటిఆర్ సూచించారు. మీ సిట్టింగ్ సిట్‌ మల్కాజ్ గిరిలో పోటీ చేసి తేల్చుకుందాం అని సవాల్ విసిరారు.

గతంలోనూ రేవంత్ సవాల్ చేసి పారిపోయారని కెటిఆర్ ఆరోపించారు. కొడంగల్, జిహెచ్ఎంపి ఎన్నికల్లో సవాల్ చేసి రేవంత్ పారిపోయారని ఎద్దేవా చేశారు.

సవాల్ చేసి పారిపోయే రేవంత్ రెడ్డి మాటకు విలువేముంది అని కెటిఆర్ ప్రశ్నించారు. కెటిఆర్‌పై రేవంత్ రెడ్డి రెండు రోజుల క్రితమే సవాల్ చేశారు. కేటీఆర్ మగాడైతే తెలంగాణ రాష్ట్రంలో ఒక్క ఎంపీ సీటు గెలిపించి చూపించాలని రేవంత్ రెడ్డి సవాలు చేశారు..ఏం జరుగుతుందో చూడాలి మరి.....

నిజంనిప్పులాంటిది

Feb 29 2024, 16:52

ఏపీ లో 18 నుంచి టెన్త్ ప‌రీక్ష‌లు

ఎపిలో ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌లు మార్చి 18వ తేది నుంచి ప్రారంభం కానున్నాయి..

మార్చి 30 తేది వ‌ర‌కు కొన‌సాగుతాయి. ఈ ప‌రీక్ష‌లు ఉద‌యం 9.30నుంచి 12.30 వ‌ర‌కు జ‌ర‌గ‌నున్నాయి.. ఎస్ ఎస్ సి బోర్డు నేడు ప‌రీక్ష‌ల టైం టేబుల్ విడుద‌ల చేసింది.

ప‌దో తరగతి పరీక్షల షెడ్యూల్

మార్చి 18 – ఫస్ట్ లాంగ్వేజ్

మార్చి 19 – సెకండ్ లాంగ్వేజ్

మార్చి 21 – థర్డ్ లాంగ్వేజ్

మార్చి 23 – గణితం

మార్చి 26 – ఫిజిక్స్

మార్చి 28 – బయాలజీ

మార్చి 30 – సోషల్ స్టడీస్

నిజంనిప్పులాంటిది

Feb 29 2024, 15:52

Hyderabad: రాడిసన్‌ హోటల్‌ డ్రగ్స్‌ కేసు.. కొనసాగుతున్న పోలీసుల విచారణ

హైదరాబాద్‌: రాడిసన్‌ హోటల్‌ డ్రగ్స్‌ కేసులో విచారణ కొనసాగుతోంది. 12వ నిందితుడిగా ఉన్న మీర్జా వాహిద్‌ను గచ్చిబౌలి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు..

ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న గజ్జల వివేకానంద్‌కు సయ్యద్‌ అబ్బాస్‌ డ్రగ్స్‌ సరఫరా చేసేవాడు. వివేకానంద్‌ కొకైన్‌ కావాలని కోరినపుడు మీర్జా వాహిద్‌ నుంచి అతడు తీసుకొచ్చేవాడు.

ఈ నేపథ్యంలో ఈ కేసుతో సంబంధాలపై మీర్జాను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. డ్రగ్స్‌ పార్టీకి సినీ దర్శకుడు క్రిష్‌ హాజరైనట్లు దర్యాప్తులో తేలడంతో పోలీసులు ఆయనను విచారణకు పిలిచారు. సోమవారం వస్తానని ఆయన సమాచారం ఇచ్చినట్లు తెలిసింది..

మరోవైపు కేసులో నిందితురాలిగా ఉన్న యూట్యూబర్‌ లిషిత పరారీలో ఉన్న విషయం తెలిసిందే. మూడు రోజుల క్రితం ఆమె ఇంటికి పోలీసులు నోటీసులు అంటించారు. దీంతో లిషిత సోదరి కుషిత పీఎస్‌కు వచ్చి నోటీసులకు సమాధానం ఇచ్చారు.

ఆమె ఇంట్లో లేదని.. వచ్చాక విచారణకు పంపిస్తామని తెలిపారు. డ్రగ్స్‌ కేసు తెరపైకి వచ్చినప్పటి నుంచి కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణకు లిషిత కచ్చితంగా రావాలని ఆమె సోదరికి పోలీసులు స్పష్టం చేశారు..